భారతీయ న్యాయ సంహిత చట్టంపై అవగాహన

74చూసినవారు
సదాశివనగర్ మోడల్ పాఠశాలలో భారతీయ న్యాయ సంహిత చట్టంపై విద్యార్థులకు శుక్రవారం అవగాహన కల్పించారు. విద్యార్థులందరూ సమాజంలో అన్ని రంగాలలో ముందు ఉండాలని ప్రోత్సహిస్తూ వారికి సంబంధించిన చట్టాల గురించి జిల్లా మిషన్ కో ఆర్డినేటర్ శిరీష, తులసి తెలియజేశారు. సఖి అడ్వకేట్ నవీన్ మాట్లాడుతూ, భారతీయ న్యాయ సంహిత చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ భానుమతి, సిబ్బంది శిరీష, శారద, తులసి, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్