ధర్మపురి దేవస్థానం హుండీల లెక్కింపు

67చూసినవారు
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హుండీలను బుధవారం విప్పి లెక్కించారు. తేదీ 30-03-2024 నుండి 12-06-2024 వరకు మొత్తం 74 రోజులకు రూ. 48, 67, 803 ఆదాయం సమకూరినట్లు ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు. అలాగే మిశ్రమ బంగారం 120 గ్రాములు, మిశ్రమ వెండి 6 కిలోల 450, 20 విదేశీ నోట్లు వచ్చినట్లు వెల్లడించారు. కరీంనగర్ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎ. చంద్రశేఖర్, ఈవో శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్