ప్రాథమిక పాఠశాలలో వీడ్కోలు సమావేశం

57చూసినవారు
ప్రాథమిక పాఠశాలలో వీడ్కోలు సమావేశం
ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులకు సోమవారం వీడ్కోలు పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ బత్తుల భూమయ్య, హెచ్ఎం భట్టూరి రాజేశం మాట్లాడుతూ. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్