ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి: విప్

65చూసినవారు
ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి: విప్
తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు ప్రసాదించాలని ఆకాంక్షించారు. షడ్రుచుల సమ్మేళనం, సంబరాల సూర్యోదయం, పంచాంగ శ్రవణం, వసంత కోయిల గానంతో పాటు వచ్చేదే తెలుగు వారి పండగ ఉగాది అని అన్నారు.

సంబంధిత పోస్ట్