హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట హుజురాబాద్ రహదారిపై సోమవారం ఇంద్రనగర్ గ్రామ సమీపంలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎలుకతుర్తి మండలం పెంచికలపేట గ్రామ ఆర్ఎంపీ వైద్యులు ఇప్పలపల్లి రవీందర్ ను 108 వాహనంలో హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడి మరో వాహనంపై గాయపడిన ఇద్దరినీ జమ్మికుంట ఆసుపత్రికి తరలించారు.