గుర్తు తెలియని వాహనం డీకొని చిన్నారి మృతి

61చూసినవారు
గుర్తు తెలియని వాహనం డీకొని చిన్నారి మృతి
జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కలపల్లికి చెందిన నిమ్మని విన్మయి తల్లి శిరీష స్కూటీపై మంగళవారం లింగంపేట గ్రామానికి ఎల్లమ్మ పట్నాల కోసం వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా దారి మధ్యలో గుర్తు తెలియని వాహనం స్కూటీని డీకొట్టింది. దీంతో స్కూటీ అదుపుతప్పి కింద పడగా విన్మయి ముక్కు భాగంలో బలంగా దెబ్బ తగిలింది. చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్