బైక్‌పై వచ్చి నగదు చోరీ

83చూసినవారు
బైక్‌పై వచ్చి నగదు చోరీ
ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఇద్దరు చోరీకి పాల్పడిన సంఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. తొర్తి గ్రామానికి చెందిన పుర్రె గంగ నర్సయ్య కథలాపూర్ యూనియన్ బ్యాంకు నుంచి రూ. 1, 68, 000 డ్రా చేసి బైక్ కవర్ లో పెట్టి ప్రక్కనున్న బేకరీ షాప్ లోకి వెళ్లి వచ్చే క్రమంలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి బైక్ కవర్ లో ఉన్న నగదును ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్