పిడుగు పాటుకు గేదె మృతి

56చూసినవారు
పిడుగు పాటుకు గేదె మృతి
మంథని మండలం కన్నాలలో బుధవారం పిడుగు పాటుకు జంగిలి సదానందంకు చెందిన గేదె మృతి చెందింది. ఇంటిముందు వేప చెట్టుపై పిడుగు వేయగా అదే చెట్టుకు కట్టేసి ఉన్న గేదె అక్కడికక్కడే మృతి చెందింది. గేదె విలువ దాదాపు రూ. 60 వేల వరకు ఉంటుందని రైతుసదానందం తెలిపారు. రైతును కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి పరామర్శించి, ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్