దొరికిన ఫోన్ పోలీసులకు అప్పగింత

79చూసినవారు
దొరికిన ఫోన్ పోలీసులకు అప్పగింత
రామగిరి మండలం సెంటినరీకాలనీకి చెందిన రామకృష్ణ మంగళవారం తెలంగాణ చౌరస్తాలో రూ. 12వేల విలువ గల సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. ఆ సెల్ ఫోన్ జర్నలిస్టు కొండ్ర సుకుమార్ కు దొరకగా, వెంటనే సెల్ ఫోన్ ను ఎస్సై సందీప్ కుమార్ కు అప్పగించారు. ఎస్ఐ సెల్ ఫోన్ పరిశీలించి సెంటినరీకాలనీకి చెందిన రామకృష్ణదిగా గుర్తించి బాధితునికి సుకుమార్ చేతుల మీదుగా ఫోన్ అందజేశారు. నిజాయితీ చాటుకున్న సుకుమార్ ను ఎస్ఐ అభినందించారు.

సంబంధిత పోస్ట్