గ్రామాల్లో పర్యటించిన డీపీఓ

74చూసినవారు
గ్రామాల్లో పర్యటించిన డీపీఓ
పెద్దపల్లి మండలం గుర్రాంపల్లి, ముత్తారం గ్రామాల్లో బుధవారం జిల్లా పంచాయితీ అధికారి ఆశాలత పర్యటించారు. మురికి కాలువలను పరిశీలించి పారిశుధ్య పనులపై సూచనలు చేశారు. సెగ్రిగేషన్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, స్మశాన వాటికలు, బావులను పరిశీలించారు. వేసవిలో ఇంటింటికి తాగునీరందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీపీఓ వెంట మండల పంచాయితీ అధికారి సుదర్శన్, ఈజిఎస్ ఏపీఓ రమేష్ బాబు, పంచాయితీ కార్యదర్శులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్