జిల్లాలోని గ్రామాల సమగ్రాభివృద్దికి అధికారులు అత్యుత్తమ సేవలనందించారని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కొనియాడారు. రాష్ట్రంలో గ్రామీణ పంచాయతీ అధికారుల బదిలీ నేపథ్యంలో బదిలీపై వెళ్తున్న డీపీఓ, డీఆర్డీఓ, జడ్పీ సీఈఓలను మంగళవారం సమీకృత కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యాంప్రసాద్ లాల్ పాల్గొన్నారు.