కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం తహసీల్దార్ జాహెద్ పాషా ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో సీఈవో కొల్లేటి శ్రీనివాస్, ఎర్రబాటి రవి, సొసైటీ, ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు.