పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుకు వెలమ కమిషన్ ఏర్పాటు చేయాలని సంఘం నాయకులు గురువారం వినతి పత్రం అందజేశారు. ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ సూచన మేరకు జిల్లా వెలమ సంక్షేమ సంఘ అధ్యక్షులు డాక్టర్ వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో పద్మనాయక వెలమ కమిషన్ ఏర్పాటు చేసేల సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుచ్చారావు, నర్సింగరావు, బాబురావు, కాంతారావు, లక్ష్మణరావు, మాధవరావు పాల్గొన్నారు.