ఖనిలో మాదక ద్రవ్యాల నివారణ ర్యాలీ

56చూసినవారు
రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖని మున్సిపల్ ఆఫీస్ నుండి చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. డ్రగ్స్ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ఎసిపీలు ఎం రమేష్, జాన్ నర్సింహులు, సిఐ లు ఇంద్రసేనారెడ్డి, లయన్స్ మగువ, విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్