భ్రూణ హత్యలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు పక్కా కార్యాచరణ అమలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణశ్రీ అన్నారు. గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణశ్రీ ఎన్. టి. పి. సి మిలీనియం హాల్లో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటి బచావ్, బేటి పడావో కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు, ఆశ వర్కర్లకు వైద్య అధికారులకు పిసిపి ఎన్ డిటి యాక్ట్ పై నిర్వహించిన వర్క్ షాప్ లో పాల్గోన్నారు.