పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి ఆత్మహత్య

26276చూసినవారు
పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో పెళ్లి పీటలు ఎక్కాలసిన యువతి సకాలంలో డబ్బులు సమకూరలేదన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడింది. అత్తారి లక్ష్మి - గిరి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె. ఏడేళ్ల క్రితం భర్త మృతి చెందాడు. ఇటీవల కూతురు సంబంధం కుదిరింది. 4 లక్షలు వరకట్నం ఇచ్చేందుకు అంగీకరించారు. అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందక పోవడంతో మనోవేదనకు గురై బుధవారం ఇంట్లో ఉరివేసుకొని చనిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్