వీర్నపల్లి మండలం అడవి పదిర, రంగం పేట, గర్జన పల్లి, వన్ పల్లి, పలు గ్రామాల్లో మహాత్మ గాంధీ జాతీయ ఉపాధిహామీ కూలీలకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్లను గురువారం అశ్విని హాస్పిటల్ డాక్టర్ అభినయ్, హాస్పిటల్ సిబ్బంది అందించారు. ప్రమాదవశాత్తూ ఎదైన ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్స అందించడానికి ఉపయోగపడుతుందని, వీటిని ఉపయోగించుకోవాలని కూలీలకు అశ్వినీ హాస్పిటల్ డాక్టర్ అభినయ్ సూచించారు.