పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ముస్తాబాద్ మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో నేత్రపర్వంగా సాగాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన విశ్వబ్రాహ్మణ మహిళలు స్వామివారికి మంగళహారతులు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. కల్యాణ మహోత్సవం వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. స్వామివారికి నూతన వస్త్రాలతో పాటు కట్న కానుకలు సమర్పించుకున్ని సేవలో తరించారు.