శ్రావణ మాసంలో వేములవాడ రాజన్నకు దండిగా ఆదాయం

59చూసినవారు
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి శ్రావణ మాసం సందర్భంగా ఆయా ఆర్జిత సేవల ద్వారా రూ. 6 కోట్ల 87 లక్షల 22 వేల 90 రూపాయలు సమకూరినట్లు ఆలయ ఈవో కె. వినోద్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభిషేకం టికెట్ల ద్వారా రూ. 21, 16, 500, కల్యాణాల టికెట్ల ద్వారా రూ. 34 లక్షల 44 వేలు, కేశఖండనం ఒకటవ కౌంటర్ ద్వారా రూ. 12, 12, 450, వివిధ ఆర్జిత సేవల ద్వారా ఆదాయం సమకూరినట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్