ఉచిత మజ్జిగ పంపిణీని ప్రారంభించిన ప్రభుత్వ విప్

565చూసినవారు
ఉచిత మజ్జిగ పంపిణీని ప్రారంభించిన ప్రభుత్వ విప్
శ్రీరామనవమి పురస్కరించుకొని వేములవాడ దేవస్థానం ఆవరణలో పొన్నం సత్తయ్య గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు మజ్జిగను అందజేశారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ప్రతి సంవత్సరం మంత్రి పొన్నం భక్తుల కోసం మజ్జికను వితరణ చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్