తన కుమారై కవితను జైలు నుంచి విడిపించుకునేందుకు ప్రధాని మోదీతో కేసీఆర్ బేరసారాలు ఆడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. 'రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ ఓర్వలేకపోతున్నాయి. కరీంనగర్ ఎంపీ సీటు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ను బలి పశువు చేశారు. బండి సంజయ్ హిందువుల పేరు మీద ఓట్ల రాజకీయం చేయడం తప్ప ఏమీ లేదు' అని ఆయన మండిపడ్డారు.