కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా ఇచ్చింది బీజేపీయేనని ఆ పార్టీ నేత, ఎంపీ బండిసంజయ్ అన్నారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం స్మార్ట్ సిటీ ఇస్తే తామే తెచ్చామని కేసీఆర్ చెబుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కేసీఆర్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదన్నారు. నిధులను కేసీఆర్ ఇతర కార్యక్రమాలకు మళ్లించారంటూ ఆరోపణలు చేశారు.