ఉగాది పర్వదినం తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారపర్వాన్ని హోరెత్తించనున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహానికి, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించనున్న ప్రచార వ్యూహానికి తేడా ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కేసీఆర్ బస్సుయాత్ర చేపట్టే అవకాశాలున్నాయని, ఇందుకోసం రూట్మ్యాప్ సైతం సిద్ధమవుతున్నదని పార్టీ వర్గాలు తెలిపాయి.