ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన రౌస్ అవెన్యూ కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వైద్య రికార్డులను పొందేందుకు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్కు అనుమతించింది. కేజ్రీవాల్ తరపున మెడికల్ బోర్డు లేదా వైద్యులను స్వతంత్రంగా సంప్రదించి సలహాలు తీసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా అధికారులను ఆదేశించారు. కాగా, ప్రస్తుతం కేజ్రీవాల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.