అహం వల్లే కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో ఓడిపోయారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి లేదని తెలిపారు. రాహుల్ గాంధీ పర్సనాలిటీని డామినేట్ చేసే సత్తా కేజ్రీవాల్ది కాదని అన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అని పేర్కొన్నారు. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ గెలిచిందని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు.