విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ టీవీల్లో ప్రసారమయ్యేందుకు సిద్ధమైంది. 'త్వరలో వస్తున్నాం' అంటూ జీ- తెలుగు ప్రకటన విడుదల చేసింది. ఓటీటీలో విడుదల కాకముందే టీవీల్లో ప్రకటన చూసి అంతా షాక్ అవుతున్నారు.