లెబనాన్ పేజర్ల పేలుళ్ల వెనుక ‘కేరళ’ వ్యక్తి హస్తం?

72చూసినవారు
లెబనాన్ పేజర్ల పేలుళ్ల వెనుక ‘కేరళ’ వ్యక్తి హస్తం?
లెబనాన్‌లో పేజర్లు పేలిన ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాదిమంది గాయపడ్డారు. ఈ ఘటన వెనక ఇజ్రాయెల్ హస్తం ఉన్నట్టు ఆరోపణులున్నాయి. ఈ నేపథ్యంలో నార్వే పౌరుడైన కేరళలోని వయనాడ్‌కు చెందిన రిన్సన్ జోస్ పేరు బయటకు వచ్చింది. బల్గేరియాలో అతడికి ఓ కంపెనీ ఉంది. ఈ సంస్థే లెబనాన్‌‌లోని హిజ్బొల్లా గ్రూపుకు పేజర్లు సరఫరా చేసింది. గత కొన్ని రోజులుగా ఎవరికీ అందుబాటులో లేడు. అతని కోసం నార్వే, బల్గేరియా, లెబనాన్ పోలీసులు రంగంలోకి దిగి గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్