తమిళనాడులో కీలక పరిణామం.. ఇద్దరు మేయర్లు రాజీనామా

56చూసినవారు
తమిళనాడులో కీలక పరిణామం.. ఇద్దరు మేయర్లు రాజీనామా
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార డీఎంకేలో రాజీనామాల పర్వం పొలిటికల్‌గా ఆసక్తి రేపింది. కోయంబత్తూరు, తిరునల్వేలి మేయర్లు రాజీనామా చేశారు. కోయంబత్తూరు మేయర్ కల్పన బుధవారం తన వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేసినట్లు కోయంబత్తూరులోని ఒక అధికారి తెలిపారు. డీఎంకేకు చెందిన కల్పన నగరానికి తొలి మహిళా మేయర్‌గా గుర్తింపు పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్