భారత జట్టు విక్టరీ పరేడ్ ముగించుకుని వాంఖడే స్టేడియం చేరుకుంది. స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోయింది. ఈ సందర్భంగా వాంఖడే స్టేడియంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి స్టెప్పులేయగా.. మిగతా క్రికెటర్లు కూడా వారితో కలిసి డ్యాన్స్ చేశారు. ‘‘రోహిత్.. రోహిత్’’, ‘‘కోహ్లీ.. కోహ్లీ’’, ‘‘హార్దిక్.. హార్దిక్’’ అంటూ అభిమానులు చేసిన నినాదాలతో వాంఖడే స్టేడిమం దద్దరిల్లింది.