Threads: ఏడాదిలోనే 175 మిలియన్ల యూజర్లు

50చూసినవారు
Threads: ఏడాదిలోనే 175 మిలియన్ల యూజర్లు
ఎక్స్‌కు పోటీగా మెటా తీసుకొచ్చిన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘థ్రెడ్స్’ పెద్ద ఎత్తున యాక్టివ్ యూజర్లను సొంతం చేసుకుంది. వినియోగంలోకి తీసుకొచ్చిన ఏడాదిలోనే ఏకంగా 175 మిలియన్ల యూజర్ మార్క్‌ను అధిగమించింది. ఈ విషయాన్ని మెటా తన బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. యూజర్లు తమ అభిప్రాయాల్ని, ఆలోచనల్ని పంచుకొనేందుకు థ్రెడ్స్‌ను ఉపయోగిస్తున్నారని పేర్కొంది. ఇందులో భారత వినియోగదారులే అధికమని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్