రూ.37 లక్షల గంజాయి పట్టివేత

66చూసినవారు
భద్రాచలంలో అబ్కారీ శాఖ ఎన్పోర్సుమెంట్ అధికారులు రూ.37 లక్షల గంజాయిని సోమవారం పట్టుకున్నారు. పట్టణ శివారులో ఎన్ఫోర్సుమెంట్ సిబ్బంది నిఘా వేసి గంజాయి తరలించే కారును ఆపారు. డ్రైవర్ కారును ఆపకుండా దూసుకెళ్లి పరారయ్యాడు. మార్కెట్ వద్ద కారును గుర్తించిన అధికారులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి ముంబాయికు 130 కిలోల గంజాయిని తరలిస్తున్నట్లు అతడు అంగీకరించాడు.

సంబంధిత పోస్ట్