నోడల్ అధికారులు విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలి

58చూసినవారు
నోడల్ అధికారులు విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలి
లోక్సభ ఎన్నికల్లో నోడల్ అధికారులు తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ వీ. పీ. గౌతమ్ సూచించారు. ఖమ్మం కలెక్టరేట్లో బుధవారం నోడల్ అధికారులతో సమావేశమైన ఆయన నామినేషన్ సహాయక కేంద్రాల ఏర్పాటు, పోస్టల్ బ్యాలెట్, పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పనపై సమీక్షించారు. ఈనెల 18 నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్