డీసీహెచ్ఎస్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్

82చూసినవారు
డీసీహెచ్ఎస్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
ఖమ్మం డీసీహెచ్ఎస్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ సందర్భంగా వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ జె. అజయ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందే సమయాన నకిలీ ధృవపత్రాలు సమర్పించినట్లు ఇటీవల గుర్తించారు. ఈ వ్యవహారంలో అసిస్టెంట్ డైరెక్టర్ కె. శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్ ఎస్. జ్యోతిపాత్ర ఉన్నట్లు విచారణలో తేలడంతో సస్పెండ్ చేశారు.

సంబంధిత పోస్ట్