May 10, 2024, 01:05 IST/పాలేరు
పాలేరు
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి: సిపిఐ
May 10, 2024, 01:05 IST
గుదిమళ్ల వద్ద యేటిలో పడి మృతి చెందిన పిల్లల కుటుంబాలను ఆదుకోవాలని సిపిఐ విజ్ఞప్తి చేసింది. గురువారం ఈతకు వెళ్లి మృతి చెందిన లోకేష్, హరీష్, గణేష్ మృతదేహాలను సిపిఐ నాయకులు బాగం హేమంతరావు, పోటు ప్రసాద్, ఎస్ కె జానిమియా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి మృతుల కుటుంబాలను ఓదార్చారు. లోకేష్, హరీష్ ల తల్లిదండ్రులు ఆముదాల చిరంజీవి, లక్ష్మి సిపిఐ నేతలను చూసి బోరున విలపించారు.