నేలకొండపల్లిలో ఓ మోస్తరు వర్షం

81చూసినవారు
నేలకొండపల్లి మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఒకేసారి మేఘాలు అలుముకొని వర్షం దంచికొట్టింది. ప్రస్తుతం కురుస్తున్న వానలు మెట్ట పంటలతో పాటు పత్తి, మిర్చి పైర్లకు ప్రయోజనం కలిగిస్తుండగా, వరి, ఉద్యాన పంటలకు కూడా మేలు చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు. కాగా, వానలతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం కలుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్