పాలేరు రిజర్వాయర్ కు జలకళ

75చూసినవారు
పాలేరు జలాశయం నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. గరిష్ఠ నీటిమట్టం 23 అడుగులు కాగా, ప్రస్తుతం 19 అడుగులతో జలకళను సంతరించుకుంది. మొదటి జోన్ నుంచి 1568 క్యూసెక్కులు, పాలేరు పరీవాహక ప్రాంతం నుంచి 2012 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. పాలేరు జలాశయం నుంచి ఎడమ కాల్వ రెండో జోన్ ఆయకట్టుకు 2810 క్యూసెక్కుల, పాత కాల్వకు 120 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్