ముంపు బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది: కలెక్టర్

67చూసినవారు
ముంపు బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది: కలెక్టర్
ముంపు బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వైరా రిజర్వాయర్ లోతట్టు ప్రాంతాలు, మున్సిపాలిటీలోని నాలుగో వార్డ్ లో వరద ముంపుకు గురైన కాలనీలను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. వరద ముంపు ప్రాంత వాసులతో మాట్లాడారు. వరద తగ్గేవరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉండాలని అన్నారు. అధికారులు, సిబ్బంది సూచనలు పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్