గుండాల: ఈ నెల 20న విలీన సభను జయప్రదం చేయండి

66చూసినవారు
గుండాల: ఈ నెల 20న విలీన సభను జయప్రదం చేయండి
ఈ నెల 20న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగు విలీన సభను జయప్రదం చేయాలని ఐఎఫ్టియూ గుండాల ఏరియా కమిటీ అధ్యక్షులు గడ్డం రమేష్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఆదివారం విలీన సభ గోడ పోస్టర్లను ఆవిష్కరించారు. హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటలకు జరుగు టియుసిఐ లోకి, ఐఎఫ్టియు విలీన సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోడూరి జగన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్