రాకాసితండాలో పనులపై ఆరా

79చూసినవారు
రాకాసితండాలో పనులపై ఆరా
ఆకేరు వరదతో తీవ్రంగా నష్టపోయిన తిరుమలాయపాలెం మండలంలోని రాకాసితండాను సోమవారం జెడ్పీ సీఈఓ దీక్షా రైనా పరిశీలించారు. వరదలతో దెబ్బతిన్న ఇళ్లు, పంట పొలాలను పరిశీలించిన ఆమె బాధితులతో మాట్లాడారు. సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని మహిళలు, రైతులు కోరారు. కాగా, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ప్రజలు దైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. పారిశుద్ధ్య పనులు, జల్లెపల్లిలో పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్