ఖమ్మం రూరల్ ఎంఈఓ కార్యాలయం ఇటీవల వచ్చిన మున్నేరు వాగు వరదలకు నీట మునిగింది. దీంతో కార్యాలయంలో ఉన్న ముఖ్యమైన దస్త్రాలు అన్నీ కూడా తడిసి ముద్దయ్యాయి. గత నాలుగు రోజులుగా కార్యాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బంది వాటిని బయట వేసి శుభ్రపరుస్తున్నారు. గదులను శుభ్రం చేశారు. కాగా వీటిలో కొన్ని ముఖ్యమైన దస్త్రాలు కూడా ఉన్నట్లు తెలిసింది.