తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కోనుగోలు చేయాలి

85చూసినవారు
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కోనుగోలు చేయాలి
ఆకేరు వరదలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కోనుగోలు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఖమ్మం రూరల్ తహశీల్దార్ కార్యాలయంలో సమస్యతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ రాంప్రసాద్ కు అందజేశారు. మండల పరిధిలోని కస్నాతండా, వాల్యాతండా, తనగంపాడు, గుండాల తండా, తీర్దాల గ్రామాల్లో ధాన్యం తడిసిపోయిందని, బాధిత రైతులను ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్