ఘనంగా కోటమ్మ మైసమ్మ తల్లి ఆలయంలో మహా పూర్ణహుతి

78చూసినవారు
కారేపల్లి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి గ్రామంలో జరుగుతున్న పవిత్ర బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మహా పూర్ణహూతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ డాక్టర్ పర్సా పట్టాభి రామారావు, విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వేణుగోపాల చార్యులు ఆలయ పూజారి కైలా శర్మ, పర్సా సనత్, పర్సా సాయికుమార్, మూడు చౌహాన్, గణితి నారాయణ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్