బావిలో ఈతకి వెళ్లి యువకుడు మృతి

7797చూసినవారు
ఖమ్మం జిల్లా వైరా మండలానికి చెందిన అకిరా నందన్ అనే యువకుడు ఈతకు వెళ్ళి ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. శనివారం అకిరా నందన్ సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం అల్లిపురంలో స్నేహితురాలి వివాహానికి వెళ్ళాడు. అక్కడ తన ముగ్గురి స్నేహితులతో కలిసి బావిలో ఈతకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. మిగతా ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్