ఇద్దరమ్మాయిల ప్రేమ చివరికి విషాదంగా మారింది. మహబూబాబాద్ జిల్లా కురవి (M)కి చెందిన ఓ యువతికి(21), బయ్యారంకు చెందిన మరో యువతి(20) ఇన్స్టాలో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారి హైదరాబాద్కు వెళ్లిపోయారు. వివాహం చేసుకొని సహజీవనం చేస్తుండగా పెద్దలు వారిని విడదీశారు. కురవి(M)కి చెందిన అమ్మాయి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.విషయం తెలుసుకున్న మరో యువతి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.