VIDEO: మైనర్ కిడ్నాప్.. తర్వాత పెళ్లి.. చివరకు అరెస్టు

52చూసినవారు
HYD: బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న యువకుడిని సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 11న సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న బాలికకు మాయమాటలు చెప్పి నల్లగొండ జిల్లాకు చెందిన హరికృష్ణ(30) విజయవాడకు తీసుకెళ్లాడు. అక్కడ ఓ హనుమాన్ గుడిలో పెళ్లి చేసుకొని.. లాడ్జికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులు సుల్తాన్ బజార్ PSలో ఫిర్యాదు చేయగా.. ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్