ఆసిఫాబాద్ నియోజకవర్గ తిర్యాని మండల కేంద్రంలో శుక్రవారం రైతులు,
కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి రుణమాఫీ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం రైతులు,
కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మండల కేంద్రం నుంచి గోయగాం, తలండి, ఇరుకపల్లి గ్రామాల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు.