బురదలో కూరుకుపోయిన బస్సు.. ప్రయాణికుల అవస్థలు

69చూసినవారు
బురదలో కూరుకుపోయిన బస్సు.. ప్రయాణికుల అవస్థలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండల కేంద్రం నుండి బుధవారం ఉదయం మంచిర్యాల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు తిర్యాని అటవిప్రాంతంలో ప్రమాదవశాత్తు బురదలో ఇరుక్కుపోయింది. బురదలో నుండి బస్సు ఎంతకీ బయటకు రాకపోవడంతో ప్రయాణికులు బస్సు నుండి కిందకు దిగి బస్సును దొబ్బే ప్రయత్నం చేస్తున్నారు. అయినా బస్సు బయటకు రాకపోవడంతో ఇటు పిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్