ప్రజా అవసరాలకై రవాణా ఏర్పాట్లు

82చూసినవారు
ప్రజా అవసరాలకై రవాణా ఏర్పాట్లు
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించేందుకు బస్ సర్వీస్ లను ఏర్పాటు చేస్తున్నట్లు కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ ఆర్టీసి డిఎం విశ్వనాథ్ తెలిపారు. మంగళవారం ఆసిఫాబాద్ నుండి కన్నర్గాం మీదుగా నందుపాకు బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందన్నారు. ప్రజలు ప్రైవేటు వాహనాలలో ప్రయాణించకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు.

సంబంధిత పోస్ట్