బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

1909చూసినవారు
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
కొమురంభీం జిల్లా రెబ్బెన మండలంలోని ఇందిరానగర్ కు చెందిన దుర్గం చిన్నయ్య, వడ్లూరి గణపతి ఇటీవల రహదారి ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే కోవ లక్ష్మి పరామర్శించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుల కుటుంబీకులను ఓదార్చి చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటూ అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ జుమిడి సౌందర్య తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్