పీడీఎస్ బియ్యం పట్టివేత

1559చూసినవారు
పెంచికల్పేట్ మండలంలో పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు సోమవారం ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎల్లూరు గ్రామంలో తణిఖీలు చేపట్టారు. ఎండీ. ముబాషీర్ ఇంట్లో తనిఖీ చేపట్టగా, తరలించుటకు సిద్దంగా ఉన్న 15క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం లభ్యమయ్యాయి. బియ్యంను పెంచికల్పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించి అతనిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ఫోర్స్ సీఐ తెలిపారు. సిబ్బంది పీసీ మధు, రమేష్, సంజీవ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్